Crocodile | నదిలో స్నానం చేస్తున్న ఓ 14 ఏళ్ల బాలుడిని మింగేసిన మొసలిని (Crocodile) కుటుంబ సభ్యులు చంపేశారు. బీహార్ (Bihar) రాష్ట్రం వైశాలీ (Vaishali) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాఘోపూర్ దియారా (Raghopur Diyara) గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కొత్త బైక్ కొనుగోలు చేసింది. కొత్త బైక్ కు పూజ చేయించాలనుకున్నారు.
పూజకు అవసరమైన పవిత్రమైన గంగాజలం కోసం నది వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జలం కోసం అమిత్ కుమార్ (14) గంగానదిలోకి దిగాడు. ముందుగా నదిలో స్నానం చేస్తుండగా ఓ భారీ మొసలి బాలుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. అనంతరం బాలుడిని అతడి కుటుంబ సభ్యుల ముందే అమాంతం మింగేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు.. స్థానికుల సాయంతో మొసలిని నదిలో నుంచి బయటకు లాగారు. రాళ్లు, రాడ్లు, కర్రలతో ఆ మొసలిని కొట్టి చంపేశారు.
Also Read..
Nigeria Boat Capsizes | ఘోర పడవ ప్రమాదం.. 103 మంది మృతి
DC Venkatrami Reddy | డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్ట్..
Adipurush Movie | ఆదిపురుష్ స్ట్రీమింగ్ అయ్యేది ఆ ఓటీటీలోనే?