Adipurush Movie Ott Partner | మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఆదిపురుష్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినీ ప్రేమికులే కాదు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. థియేటర్లు నిండుగా కనిపించి దాదాపు రెండు నెలలయింది. ప్రేక్షకులు లేక వెలవెల బోయిన థియేటర్లు ఆదిపురుష్ తో కలకళలాడబోతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు ఆదిపురుష్ పై అసలు అంచనాలే లేవు. నిజానికి ఈ సినిమాను కొనడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ సిద్ధంగా లేడు. ఏమంట ట్రైలర్ రిలీజయిందో అప్పటి నుంచి ఈ సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానికి తోడు జైశ్రీరామ్ పాట ఒక ఊపు ఊపడంతో అందరి నోళ్లల్లో ఆదిపురుష్ పేరే నానింది. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు.
ఇక ఇదిలా ఈ సినిమాకు ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. కాగా థియేటర్లో విడుదలైన 8 వారాల తర్వాత ఆదిపురుష్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. మైథలాజికల్ సినిమాగా రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతీసనన్ సీతగా కనిపించనుంది. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇక ఇప్పటికే అభిషేక్ అగర్వాల్, రణ్ బీర్ కపూర్, మంచు మనోజ్ ఫ్యామిలీ ఇలా పలువురు అనాధ పిల్లల కోసం ఉచితంగా టిక్కెట్లు స్పాన్సర్ చేస్తున్నట్లు వెల్లడించారు.