కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ మరోసారి తన సత్తా చాటారు. మొత్తం 292 స్థానాలకుగాను అధికార టీఎంసీ 200కుపైగా స్థానాల్లో గెలుపు, ఆధిక్యంలో ఉన్నది. మరోవైపు బీజేపీ సుమారు 80 స్థానాల్లో లీడ్లో ఉన్నది. ఎన్నికల ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరి సవాల్ విసిరిన సువెందు అధికారిపై నందిగ్రామ్లో పోటీ చేసిన మమతా బెనర్జీ భారీ ఉత్కంఠ మధ్య 1200 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కాగా, మమతతో పాటు మరి కొందరు టీఎంసీ అభ్యర్థులు కూడా బీజేపీ అభ్యర్థులపై ఇలాగే విజయం సాధించారు. ఇరు పార్టీ అభ్యర్థుల మధ్య వెయ్యిలోపు మార్జిన్ ఉన్నట్లు కౌంటింగ్ ట్రెండ్స్ ద్వారా తెలుస్తున్నది. సుమారు 60 స్థానాల్లో టీఎంసీ, బీజేపీ అభ్యర్థుల మధ్య మార్జినల్ ఓట్ల తేడా 2000 లేదా అంతకన్నా తక్కువగా ఉన్నది. అలాగే టీఎంసీ లీడ్లో ఉన్న36 స్థానాల్లో ఓట్ల తేడా వెయ్యి కన్నా తక్కువగా ఉన్నది. టీఎంసీ, బీజేపీ అభ్యర్థుల మధ్య 11 స్థానాల్లో 500 కన్నా తక్కువగా, పది స్థానాల్లో వెయ్యి నుంచి 500 ఓట్ల తేడా ఉన్నది.
మరోవైపు బీజేపీ అభ్యర్థులు 9 స్థానాల్లో 2 వేల కన్నా తక్కువగా, మరో మూడు స్థానాల్లో 500 కన్నా తక్కువ ఓట్లతో టీఎంసీ అభ్యర్థులపై ఆధిక్యంలో ఉన్నట్లు ఈసీ వెబ్సైట్ ట్రెండ్స్ ద్వారా తెలుస్తున్నది.