లక్నో: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో త్వరలోనే తిరుగుబాటు జరగబోతున్నదని, పార్టీ చీఫ్ పదవి నుంచి అఖిలేశ్ యాదవ్ తప్పుకోనున్నారని, ఆ బాధ్యతలను శివపాల్ సింగ్ యాదవ్ చేపట్టనున్నారని ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎపీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్భర్ వ్యాఖ్యానించారు. బైరియాలో విలేకరులతో మాట్లాడిన ఆయన శివసేన, తృణమూల్ కాంగ్రెస్ తరహాలోనే సమాజ్వాదీ పార్టీ కూడా పయనిస్తున్నదన్నారు.
అఖిలేశ్ యాదవ్ పక్కకు తప్పుకోవలసి వస్తుందని, శివపాల్ సింగ్ యాదవ్ పార్టీని నడిపిస్తారని అన్నారు. బల్లియా నుంచే ఈ తిరుగుబాటు ప్రారంభం కానున్నదని సుహేల్ దేవ్ జోస్యం చెప్పారు. ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిశారని, ఆయన కనుసన్నల్లోనే రాయ్ పార్టీలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు.