Loksabha Elections 2024 : కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని విపక్షం దుష్ప్రచారం సాగిస్తోందని లోక్సభ స్పీకర్, రాజస్ధాన్లోని కోటా నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఓం బిర్లా పేర్కొన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయబోమని ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారని తెలిపారు.
రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాని మోదీ గతంలో కూడా వివరణ ఇచ్చారని చెప్పారు. రిజర్వేషన్లో సామాజిక వ్యవస్ధ ఉందని, దానిని కదిలించబోమని మోదీ తెలిపారని పేర్కొన్నారు. ఈసారి 400 స్ధానాలు వస్తాయని అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారని దాని అర్ధం కాదని వివరించారు.
ప్రజల్ని తప్పుదారిపట్టించి, అసత్యాలు ప్రచారం చేసి ఓట్లు పొందాలని విపక్షం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఓం బిర్లా మండిపడ్డారు. విపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరని, వారికి వాస్తవాలేంటో తెలుసని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి కొలువుతీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read More :
Nitin Gadkari | రాజ్యాంగం మారుస్తామని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి : నితిన్ గడ్కరీ