ఉత్తరాఖండ్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ను నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
గర్వాల్ హిమాలయాల ఎగువ ప్రాంతంలో వర్షం, మంచు కురుస్తుండడంతో ఏప్రిల్ 30 వరకు రిషికేశ్, హరిద్వార్లోని చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తున్నట్టు సంబంధిత అధికారులు ఆదివారం వెల్లడించారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులపై సమీక్షించి తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని వివరించారు. కాగా, ఇప్పటికే 16 లక్షలకు పైగా యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు పేర్కొన్నారు.