న్యూఢిల్లీ: కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ అధికార ట్విట్టర్ ఖాతా గురువారం కొంత సేపు హ్యాక్ అయ్యింది. ఈ ఖాతా పేరును టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్గా మార్చారు. ఆయన ఫొటోను ప్రొఫైల్ పిక్గా ఉంచారు. ‘మిలియనీర్ కావడానికి ఇది ప్రత్యేకమైన అవకాశం. 7,200,000 డాలర్లు గెలిచేందుకు మిస్టరీ బాక్స్లో ఉన్నాయి’ అని పేర్కొంటూ ఒక లింక్ను సైబర్ నేరగాళ్లు ఈ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. దీంతో వెంటనే ఆ ట్వీట్ను తొలగించారు. హ్యాక్ అయిన స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ అధికార ట్విట్టర్ ఖాతాను గురువారం మధ్యాహ్నం పునరుద్ధరించారు.
అనంతరం కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. తమ అధికార ట్విట్టర్ ఖాతాకు గురువారం సెబర్ భద్రతకు సంబంధించిన సమస్యలు వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు అందులో పోస్ట్ అయిన లేదా షేర్ చేసిన, బదులు ఇచ్చిన సమాచారానికి తమ మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
కాగా, కేంద్ర ప్రభుత్వ అధికార ట్విట్టర్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్, వ్యక్తిగత వెబ్సైట్ హ్యాక్ అయ్యాయి. అలాగే కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వెబ్సైట్ కూడా హ్యాక్లర్ల బారినపడింది.
It is to inform to all concerned that certain cyber security issues were noticed in the MoSPI Twitter account @GoIStats on today. Any post & reply pushed / posted from this account on today till 3.00 PM are neither related to MoSPI nor on behalf of the Ministry.
— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) March 17, 2022