Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం ఘటనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు. భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. రైల్వే బోర్డు మొత్తం కేసును పూర్తిస్థాయి దర్యాప్తు కోసం సీబీఐకి సిఫారసు చేస్తోందన్నారు. అన్నింటిని దృష్టిలో పెట్టుకొని.. ఇప్పటి వరకు ఎలాంటి పరిపాలనాపరమైన సమాచారం వచ్చినా దర్యాప్తును సీబీఐతో జరపాలని బోర్డు నిర్ణయించిందని వివరించారు.
అయితే, ప్రమాదానికి మూల కారణాన్ని, దానికి బాధ్యుతులైన ‘నేరస్తులను’ గుర్తించామన్న ఆయన.. కొద్ది గంటల్లోపే సీబీఐకి సిఫారసు చేస్తున్నట్లు తెలుపుడం గమనార్హం. ఇంకా ఆయన మాట్లాడుతూ.. సంఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు పూరయ్యాయన్నారు. సంఘటనా స్థలంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే ట్రాక్కు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, ఓవర్హెడ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతుందన్నారు.