Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్లో ఘోర రైలు ప్రమాదంతో మాటలకందని విషాదం నెలకొన్నది. 280 మందికిపైగా మృతి చెందగా.. 900 మందికిపైగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రులకు తరలించగా చికిత్స పొందుతున్నారు. మరో వైపు బాధితుల కోసం రక్తదానం చేసేందుకు యువత ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. కటక్, భద్రక్, బాలాసోర్లోని ఆసుపత్రుల వద్దకు జనం చేరుకున్నారు. కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం చేసేందుకు తరలివచ్చారు.
సుధాంషు అనే యువకుడు మాట్లాడుతూ రైలు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఇక్కడి ఆసుపత్రికి తీసుకువస్తున్నారని తెలిసిందని, వారి కోసం రక్తదానం చేయాలని భావించినట్లు తెలిపాడు. తాను చేసే రక్తదానం కొంత మంది ప్రాణాలనైనా కాపాడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. యువత వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. మరో వయుకుడు విభూతి శరణ్ మాట్లాడుతూ తనతో పాటు స్నేహితులు రక్తదానం చేశారని, ప్రమాదంలో గాయపడ్డవారంతా క్షేమంగా ఇండ్లకు వెళ్లాలని ప్రార్థిస్తున్నాని తెలిపాడు. కటక్, భద్రక్, బాలాసోర్లో శుక్రవారం రాత్రి నుంచి 3వేల యూనిట్లకుపైగా రక్తం సేకరించినట్లు ఎస్సీబీ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుడు జయంత్ పాండ తెలిపారు.
#WATCH | There is a very huge response from the youth. Hundreds of people donated blood. More than 3000 units of blood collected since last night in Cuttack, Balasore and Bhadrak. We’ve also donated to CM and PM relief funds: Dr Jayant Panda, SCB Medical College, Cuttack on… pic.twitter.com/UZT2ukgHjR
— ANI (@ANI) June 3, 2023