భువనేశ్వర్ : కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఈనెల 20 నుంచి కాలేజీలు, యూనివర్సిటీలను తిరిగి తెరిచేందుకు ఒడిషా ప్రభుత్వం అనుమతించింది. సెప్టెంబర్ 20 నుంచి అండర్ గ్రాడ్యుయేట్, యూజీ కోర్సుల ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభంకానున్నాయి.
కొవిడ్-19 నిబంధనలను విధిగా పాటిస్తూ తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే కళాశాలల్లో విద్యార్ధుల హాజరు అనివార్యం కాదని, ఆన్లైన్ క్లాసులు కూడా విద్యార్ధులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కళాశాలల్లో విద్యార్ధులు, బోధనా సిబ్బంది విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం నిబంధనలను పాటించాలని కోరారు.