లక్నో: ఆమె ఓ నర్సు (Nurse). ప్రైవేటు నర్సింగ్లో ఉద్యోగం వచ్చింది. కోటి ఆశలతో మొదటి రోజు విధులకు వెళ్లింది. తెల్లారేసరికి అదే దవాఖాన గోడకు ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావోలో జరిగింది.
ఉన్నావోలోని ఓ నర్సింగ్ హోమ్లో అదే పట్టణానికి చెందిన మహిళా నర్సుకు ఉద్యోగం లభించింది. శుక్రవారం విధులకు హాజరయింది. అయితే మరుసటి రోజు తెల్లారేసరికి హాస్పిటల్ గోడకు వేలాడుతూ కనిపింది. అయితే తమ కూతురిపై లైంగిక దాడి జరిగిందని, తర్వాత హత్యచేసి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు నర్సింగ్ హోమ్ అడ్మినిస్ట్రేటర్ సహా ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని ఉన్నావో అధనపు ఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపారు.
Nurse