Nuh Violence | హర్యానా నూహ్లో చెలరేగిన హింస్మాకాండ గురువారానికి దక్షిణ హర్యానా అంతటి విస్తరించింది. గురుగ్రామ్తో పాటు పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అయితే, ఈ అల్లర్లపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. యూఎస్ స్టేట్ డిపార్టహెంట్ శాంతిని పాటించాలని, హింసను మానాలని అన్ని పార్టీలను కోరింది. అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్ బుధవారం మాట్లాడుతూ.. ఎప్పటిలాగే ప్రశాంతత పాటించాలని, అదే సమయంలో హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. హింసపై పూర్తిగా తెలియదని, అమెరికా ప్రజల ద్వారా తెలుసుకున్నామన్నారు. అనంతరం ఎంబసీని సంప్రదించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. నూహ్లో చెలరేగిన హింస దక్షిణ హర్యానా అంతటా వ్యాపించింది. అల్లర్లలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. ఇద్దరులో పోలీసులు సైతం ఉన్నారు.