మధురై: తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి ఆలయంలో ఇవాళ నేషనల్ సెక్యూర్టీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండోలు కౌంటర్ టెర్రరిజం డ్రిల్ చేపట్టారు. తమిళనాడు రాష్ట్ర పోలీసులతో కలిసి ఎన్ఎస్జీ దళాలు ఆ ఆపరేషన్లో పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి పూట ఈ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు దాడి చేస్తే, ఎటువంటి యాక్షన్ చేపట్టాలన్న దానిపై కమాండోలు ప్రిపేరయ్యారు. అటాక్ సమయంలో ప్రజలను ఎలా రక్షించాలన్న కోణంలోనూ కమాండోలు ఆ డ్రీల్లో చేశారు.