న్యూఢిల్లీ : గత ఏడాది మే నుంచి నవంబర్లో దేశంలో అతితక్కువగా కేవలం 3.1 లక్షల కొవిడ్-19 తాజా కేసులు నమోదయ్యాయి. వరుసగా ఆరు నెలలుగా నవంబర్లో తాజా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మే 6న కొవిడ్-19 కేసులు ఏకంగా 4,14,188 నమోదవగా గత 54 రోజులుగా కరోనా కేసులు రోజుకు 20,000 దాటలేదు.
ప్రస్తుతం గత 156 రోజుల నుంచి 50,000లోపు కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8954 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలుతోందనే ఆందోళన నేపధ్యంలో గత అయిదు రోజులుగా కరోనా కేసులు 10,000 దిగువన నమోదవడం ఊరట ఇస్తోంది.
గడిచిన 24 గంటల్లో మహమ్మారితో బాధపడుతూ 267 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కరోనా రికవరి రేటు గరిష్టంగా 98.36 శాతంగా ఉందని తెలిపింది.