Ram Mandir | భువనేశ్వర్: నారాయణ్ గఢ్ జిల్లా, ఫతేగఢ్ గ్రామంలో నిర్మితమైన రామాలయం ప్రారంభోత్సవం కూడా సోమవారం జరగనున్నది. కొండపైన నిర్మితమైన ఈ దేవాలయం ఎత్తు 165 అడుగులు. దీని నిర్మాణం 2017లో ప్రారంభమైంది.
అయోధ్య ఆలయం లోపలి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సమ్మోహనపరిచే కాంతులతో రామాలయం కనువిందు చేస్తున్నది. సహజమైన పు ష్పాల సౌందర్యం కట్టిప్తస్తున్నది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అమెరికాలో 1,000 ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠితమవుతున్న బాలరాముని విగ్రహాన్ని 300 కోట్ల ఏండ్లనాటి శిలతో తయారు చేసినట్లు మైసూరు విశ్వవిద్యాలయం భూగర్భ శాస్త్ర శాఖ మాజీ ప్రొఫెసర్ శ్రీకంఠప్ప చెప్పారు.