న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: నాలుగో దశ లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ కానున్నది. ఈ దశలో 9 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 96 లోక్సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగనున్నది. ఏపీలో 25 సీట్లు, తెలంగాణలో 17 సీట్లు, యూపీలో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లు, బీహార్లో 5, జార్ఖండ్, ఒడిశాలలో 4 సీట్లు, జమ్మూ కశ్మీర్లోని ఒక్క సీటుకు నాలుగో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేయచ్చు.