UCC | కోల్కతా: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశం అర్థం లేని భావన అని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ విమర్శించారు. యూసీసీ భావనకి హిందూత్వకి సంబంధం ఉందని ఆయన అన్నారు. యూసీసీ ఏన్నో ఏండ్ల నుంచి ఉందని, ఇది కఠినమైన అంశమని తెలిపారు. పశ్చిమబెంగాల్లోని బిర్భూమ్లో సేన్ మాట్లాడారు. ‘హిందూత్వ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడంలో యూసీసీకి సంబంధం ఉంది.
దేశ ప్రగతికి హిందూత్వ ఒక్కటే మార్గం కాదు. హిందూత్వ దుర్వినియోగం అవుతున్నది. యూసీసీ అమలులో అలసత్వానికి చోటివ్వకూడదని ఇటీవల పత్రికల్లో చదివాను. ఇలాంటి అర్థం లేని భావన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో అర్థం కావడం లేదు. మతం, ఆచారాలలో తేడాలున్నాయి. ఆ భేదాలను తొలగించి, భారతీయులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని ఆయన తెలిపారు.