న్యూఢిల్లీ, డిసెంబర్ 1: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 10 నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదు. గత మార్చిలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 112.8 డాలర్లుగా ఉండగా, అదిప్పుడు 87.82 డాలర్లకు తగ్గింది. కానీ కేంద్రం ఆ మేరకు ఇంధన ధరలను తగ్గించకుండా లాభాలను జేబులో వేసుకుంటున్నది. ధరల తగ్గింపు ప్రయోజనం సామాన్యుడికి దక్కనీయకుండా చేస్తున్నది. క్రూడాయిల్కు అనుగుణంగా ఇంధన ధరలు సవరిస్తే కనీసం రూ.10 వరకూ ధర తగ్గే అవకాశం ఉన్నదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గితే దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. కానీ, మోదీ సర్కారు ధరలను తగ్గించకపోగా పెంచుకుంటూ పోయింది. 2015-17 మధ్య క్రూడాయిల్ ధరలు 45-47 డాలర్ల మధ్యనే ఉన్నాయి. ఈ సమయంలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్పై 22.9 శాతం, డీజిల్పై 68.47 శాతం పెంచింది. ఈ పన్నులు పెంచకుంటే పెట్రోల్, డీజిల్ రూ.50-55 లోపే లభించేది. 2019-20లో క్రూడాయిల్ ధర 60.47 డాలర్లుగా ఉండగా.. 2020-21లో 44.82 డాలర్లకు పడిపోయింది. కరోనా వల్ల డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే కేంద్రం ఆ మేరకు ధరలు తగ్గించకపోగా పెంచుకుంటూ పోయింది. 2020 మార్చి 30న పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.19.98గా ఉండగా, 2021 ఫిబ్రవరి నాటికి రూ.32.90కి పెంచింది. డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ.15.83 నుంచి 31.80కి పెంచింది.
కేంద్రం దోపిడీ ఇలా..
పెట్రో ధరలు రూ.10 తగ్గించొచ్చు: రాహుల్
‘6 నెలల్లో క్రూడాయిల్ ధర 25 శాతానికి పైగా తగ్గింది. అంటే.. పెట్రోల్, డీజిల్ రూ.10 దాకా తగ్గించొచ్చు. కానీ, కేంద్రం ఒక్క రూపాయూ తగ్గించలేదు.’ అని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శించారు.