PM Kisan | న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద ప్రస్తుతం ఏడాదికి అందజేస్తున్న 6 వేల రూపాయల సహాయాన్ని పెంచే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం లోక్సభలో స్పష్టం చేశారు.
‘ప్రస్తుతానికైతే 6 వేల సహాయాన్ని పెంచే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదు’ అని ఆయన పేర్కొన్నారు. పీఎం-కిసాన్ పథకం కింద రైతుల వ్యవసాయ ఖర్చులకు ఏడాదికి ఈ మొత్తాన్ని 2018 డిసెంబర్ నుంచి కేంద్రం అందజేస్తున్నది. ఈ సహాయాన్ని నాలుగు నెలలకొకసారి నేరుగా రైతుల ఖాతాల్లో 2 వేల వంతున జమ చేస్తున్నది.