న్యూఢిల్లీ, ఆగస్టు 17: ప్రస్తుతానికి మన దేశంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అవసరం లేదని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్ తెలిపారు. భారత్లో లేదా ఇతర దేశాల్లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మూడో డోసు అవసరమనడానికి ఎలాంటి డాటా లేదని చెప్పారు. మూడో డోసుతో మరిన్ని యాంటిబాడీలు ఉత్పత్తి అవుతాయా, దాంతో మెరుగైన రక్షణ లభిస్తుందా అనేది ఇప్పటికీ తెలియదని పేర్కొన్నారు.