న్యూఢిల్లీ: ఆదాయపన్ను పరిమితిని కేంద్రం పెంచింది. ఆదాయ పన్ను పరిమితి ఏడు లక్షలకు పెంచేశారు. 5 లక్షల నుంచి ఏడు లక్షలకు ఆదాయపన్ను పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి నిర్మల తెలిపారు. ఇక నుంచి ఏడు లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను ఉండదని ఆమె వెల్లడించారు. ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మల ఈ విషయాన్ని తెలిపారు.
Personal #IncomeTax for the hardworking middle class
Currently, those with an income of Rs 5 lakhs do not pay any income tax and I proposed to increase the rebate limit to Rs 7 lakhs in the new tax regime
Finance Minister @nsitharaman
#Budget2023 #AmritKaalBudget pic.twitter.com/4PBNa3KsG5
— PIB India (@PIB_India) February 1, 2023
రూ.6 లక్షల నుంచి 9 లక్షల ఉన్నవారికి 10 శాతం పన్ను, 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను విధించనున్నారు. కొత్త పన్ను విధానంలో ఈ రిబేట్ను కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 2020లో ఆరు ఇన్కం స్లాబ్స్లో పన్ను విధానాన్ని ప్రవేశపెట్టామని, దాన్ని అయిదుకు తగ్గించామన్నారు.
15 లక్షల ఆదాయం దాటిన వారికి 30 శాతం పన్ను విధించనున్నారు. కొత్త పన్ను విధానం ప్రకారం సర్చార్జ్ను 37 నుంచి 25 శాతానికి తగ్గించినట్లు మంత్రి తెలిపారు. కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ పద్ధతిలో అమలు చేయనున్నట్లు చెప్పారు.
9 లక్షల ఆదాయం ఉన్న వారికి సాలీనా సుమారు 45 వేల పన్ను కట్టే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. 15 లక్షలు ఆదాయం ఉన్న వారికీ ప్రతి ఏడాది 1.5 లక్షల పన్ను కట్టాల్సి ఉంటుంది.