ముంబై, సెప్టెంబర్ 3: ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుపై ఈ నెల 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టుకు తెలిపింది. వరవరరావు బెయిల్ గడువు 5వ తేదీతో ముగియనున్నది. గడువును పొడిగించాలని వరవరరావు తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. స్పందించిన ధర్మాసనం ఈ పిటిషన్పై 6వ తేదీన వాదనలు వింటామని తెలిపింది. దీంతో న్యాయవాది కలుగజేసుకుంటూ అప్పటి వరకు వరవరరావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్ఐఏను ఆదేశించాలని కోరారు.