కేంద్రానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఝలక్ ఇచ్చారు. కేంద్ర న్యాయ శాఖ నిర్వహించిన ముఖ్యమంత్రుల సదస్సుకు నితీశ్ గైర్హాజరయ్యారు. తనకు బదులుగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రిని ఈ సమావేశానికి వెళ్లాలని నితీశ్ సూచించారు.
అతి త్వరలోనే బిహార్ సీఎం మారిపోతున్నారని బీజేపీ నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారని, దీంతో సీఎం నితీశ్ నొచ్చుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగానే సీఎం నితీశ్ ఢిల్లీ సమావేశానికి వెళ్లలేదని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు.
ఆర్జేడీ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు సీఎం నితీశ్ హాజరవ్వడంతో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఇలా వెళ్లడం చాలా పాత సంప్రదాయమని, ఈ సంప్రదాయం ప్రకారమే తాము సీఎం నితీశ్ను కూడా పిలిచామని ఆర్జేడీ ఇప్పటికే ప్రకటించింది. అయినా.. బీజేపీకి ఈ సమాధానం నచ్చడం లేదని సమాచారం.