Nityananda | న్యూఢిల్లీ, జనవరి 21: పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానంద తనకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని వెల్లడించారు. తాను ఈ వేడుకకు హాజరవుతున్నానని తెలిపారు. ‘చారిత్రక, అపూర్వమైన ఈ వేడుకకు హాజరవ్వకుండా ఉండొద్దు.
ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచం మొత్తాన్ని దీవించేందుకు శ్రీరాముడు లాంఛనంగా ఈ ఆలయంలో కొలువు దీరనున్నాడు’ అని కైలాస దేశం ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. లైంగిక దాడి కేసులో బెయిల్పై విడుదలైన నిత్యానంద 2020లో దేశం విడిచిపెట్టి పారిపోయారు.