Nirmala Sitharaman : బీజేపీయేతర రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు, పన్ను వాటాలను చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. లోక్సభలో సోమవారం ఆమె మాట్లాడుతూ అధిర్ రంజన్ ఆరోపణులు రాజకీయ కోణంలో ఉన్నాయని తప్పుపట్టారు.
రాష్ట్రానికో రకంగా తన ఇష్టానుసారంగా నిబంధనలను మార్చే హక్కు తనకు లేదని, ఇది తమ పార్టీ రాజకీయాలకూ విరుద్ధమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. తనకు నిబంధనలను మార్చే బాధ్యత ఉండదని, తాను నిబంధనలను నూరు శాతం అనుసరించాల్సిందేనని పేర్కొన్నారు. పన్నుల వాటా రాష్ట్రాల మధ్య పంపిణీని ఫైనాన్స్ కమిషన్ నిర్ధేశిస్తుందని ఆమె వివరించారు.
ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను తాను అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు. దీన్ని తాము ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా చేపడతామని తెలిపారు. ఈ ప్రక్రియ ఇలా సాగుతుంటే కొన్ని రాష్ట్రాలు రాజకీయ రంగు పులుముతూ ఆయా రాష్ట్రాల పట్ల వివక్ష కనబరుస్తున్నామని ఆరోపిస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు ఈ రాష్ట్రం ఇష్టం లేదని వారికి చెల్లింపులు నిలిపివేయడంని ఏ ఆర్ధిక మంత్రి జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని అన్నారు.
Read More :
Uttar Pradesh | వరుడు లేకుండానే పెండ్లి!.. యూపీలో సామూహిక వివాహాల స్కామ్