న్యూఢిల్లీ/బెంగళూరు, జనవరి 12: కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్ను కర్ణాటక నుంచి లోక్సభకు పోటీ చేయించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. ప్రస్తుతం వీరిద్దరు రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
అయితే కర్ణాటకలోని క్లిష్ట పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దక్షిణ కన్నడ నుంచి నిర్మలా సీతారామన్ను, ఉత్తర కన్నడ లేదా బెంగళూరు సౌత్, బెంగళూరు సెంట్రల్ నుంచి జైశంకర్ను పోటీకి దింపాలని బీజేపీ ఆలోచిస్తున్నది. మరోవైపు, సిట్టింగ్ ఎంపీల్లో దాదాపు సగం మందికిపైగా ఈ సారి పోటీ చేయమని అధిష్ఠానానికి చెప్తున్నారు. అధిక వయస్సు, అనారోగ్యాన్ని కారణంగా చూపుతున్నారు.