న్యూఢిల్లీ : ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ, యూపీని కుంభవృష్టి వణికిస్తోంది. భారీ వర్షాలతో ఉత్తర్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో 9 మంది మరణించారు. మరో 24 గంటలు వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించడంతో అధికారులు అప్రమత్త మయ్యారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రోడ్లు జలమయం కాగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోటెత్తిన వరదతో ఢిల్లీలో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. ఇక భారీ వర్షాలతో లక్నో, నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్, ఆగ్రా, అలీఘఢ్ నగరాల్లో పాఠశాలు, విద్యా సంస్ధలకు అక్టోబర్ 12 వరకూ సెలవలు ప్రకటించారు. మరోవైపు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 11 వరకూ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.