NIA | జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్ వచ్చింది. తాను తాలిబన్ సభ్యుడినని.. ముంబైలో ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేశాడు. అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు.. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది.
ముంబైకి బాంబు బెదిరింపులు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ అనేక సార్లు ఇలాంటి బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చాయి. నగరంలో చాలాచోట్ల బాంబులు పెట్టామంటూ గతేడాది అక్టోబర్లో పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అయితే, ఆ బెదిరింపు కాల్లో నిజం లేదని తేలింది.
Maharashtra | NIA received an email about a terrorist attack in Mumbai, after which the Police have been alerted. NIA informed Mumbai Police that the sender described himself as Talibani. Along with other agencies, Mumbai Police is involved in investigation: Mumbai Police Sources
— ANI (@ANI) February 3, 2023