వ్యక్తిగతంగా తాను హారర్ సినిమాల్ని ఇష్టపడతానని, ‘ఈషా’ సినిమా చాలా రోజుల పాటు అందరినీ వెంటాడుతుందని అన్నారు హీరో శ్రీవిష్ణు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖిల్రాజ్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఈషా’ చిత్రానికి శ్రీనివాస్ మన్నె దర్శకుడు. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ..ఈ సినిమా చూస్తుంటే అందరి వెన్నులో వణుకు పుడుతుందని, హారర్ సినిమా ప్రేమికులు బాగా ఎంజాయ్ చేస్తారని, పతాక సన్నివేశాలు షాకింగ్గా అనిపిస్తాయన్నారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల్ని భయపెట్టి, ఓ అర్థవంతమైన సందేశాన్ని అందిస్తామని, మంచి సినిమా చూసిన ఫీల్తో బయటికొస్తారని వంశీ నందిపాటి పేర్కొన్నారు. చాలా రోజుల పాటు గుర్తుండిపోయే చిత్రమిదని, అంతర్లీనంగా సందేశం కూడా ఉంటుందని దర్శకుడు శ్రీనివాస్ మన్నె తెలిపారు.