న్యూఢిల్లీ: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని ఐదు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఖతార్పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఈమేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ను, రోడ్డు నిర్మాణ ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు.
మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా వరకు జాతీయ రహదారి 53పై రోడ్డు నిర్మాణ పనులను ఎన్హెచ్ఏఐ గత శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభించి.. మంగళవారం పూర్తిచేసింది. మొత్తం 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డును 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసింది. దీంతో అతి తక్కువ సమయంలో 75 కి.మీ. రోడ్డు పూర్తిచేసి గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది. దీనిని గిన్నిస్ సంస్థ గుర్తించి సర్టిఫికెట్ కూడా అందజేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఖతార్కు చెందిన పబ్లిక్ వర్క్స్ అథారిటీ ఏఎస్హెచ్డీహెచ్ఏఎల్ పేరుపై ఉన్నది. 2019, ఫిబ్రవరి 17న అల్-ఖర్ ఎక్స్ప్రెస్వే పై 75 కి.మీ. రోడ్డును ఏఎస్హెచ్డీహెచ్ఏఎల్ నిర్మించింది. అయితే దీనికోసం పదిరోజుల సమయం తీసుకున్నది.
#ConnectingIndia with Prosperity!
Celebrating the rich legacy of our nation with #AzadiKaAmrutMahotsav, under the leadership of Prime Minister Shri @narendramodi Ji @NHAI_Official successfully completed a Guinness World Record (@GWR)… pic.twitter.com/DFGGzfp7Pk
— Nitin Gadkari (@nitin_gadkari) June 7, 2022
కాగా, ఎన్హెచ్ఏఐ తరఫున రాజ్పుత్ ఇన్ఫ్రాకాన్ అనే సంస్థ ఈ రోడ్డును అతి తక్కువ సమయంలో నిర్మించింది. ఇందులో మొత్తం 800 మంది ఉద్యోగులు, 700 మంది కార్మికులు పాల్గొన్నారు. అయితే గతంలో కూడా ఈ సంస్థ సాంగ్లీ-సతారా మధ్య 24 గంటల్లో రోడ్డు వేరి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.