పీఎఫ్, జీఎస్టీ, ఎల్పీజీ, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో మార్పులు
న్యూఢిల్లీ, ఆగస్టు 31: బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి కీలక రంగాలకు సంబంధించిన సేవల్లో బుధవారం (సెప్టెంబర్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఆధార్-పీఎఫ్ అనుసంధానం
ఆధార్ కార్డు నంబర్ను ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాతో బుధవారంలోపు (సెప్టెంబర్ 1లోపు) అనుసంధానించాలి. లేకపోతే, పీఎఫ్ ప్రయోజనాలను పొందలేరని ఈపీఎఫ్వో వెల్లడించింది.
ఆధార్-పాన్ లింకింగ్
ఈ నెల 30 నాటికి పాన్ కార్డును ఆధార్తో అనుసంధానించాలి. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ఈ గడువును పెంచింది.
జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్
ఇక నుంచి ఏ వ్యాపార సంస్థ అయినా వరుసగా రెండు నెలల పాటు జీఎస్టీఆర్-3బీ ఫైల్ చేయకపోతే జీఎస్టీఆర్-1 రిటర్నుల ఫైలింగ్ను అనుమతించబోరు.
పాజిటివ్ పే విధానం
చెక్కు చెల్లింపుల్లో మోసాలను నిరోధించడానికి ఆర్బీఐ జనవరి 1న ‘పాజిటివ్ పే విధానా’న్ని తీసుకొచ్చింది. కాగా బుధవారం నుంచి యాక్సిస్ వంటి ప్రముఖ బ్యాంకులు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నాయి.
ఎల్పీజీ ధరల్లో మార్పు
ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగనున్నట్టు సమాచారం.
కార్లకు బీమా
కొత్తగా కొనుగోలు చేసే కార్లకు తప్పనిసరిగా బీమా చేయించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
బీహెచ్-సిరీస్
కొత్త వాహనాలకు ‘బీహెచ్-సిరీస్’ పేరిట కేంద్రం కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ను తెచ్చింది. బీహెచ్-సిరీస్ కలిగిన వాహనాలు కొత్తగా మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరంలేకుండానే దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది.