భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ బయటపడింది. ఒక పాజిటివ్ కేసు శాంపిల్లో దీనిని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) తెలిపింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసింది. దీంతో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వస్ సారంగ్ గురువారం తెలిపారు. కాగా, దేశంలో కరోనా సెకండ్ వేవ్కు డెల్టా వేరియంట్ కారణమని భావిస్తుండగా తాజాగా దాని కంటే మరింతగా వ్యాప్తి చెందే డెల్టా ప్లస్ వేరియంట్ను గుర్తించారు. మరోవైపు భోపాల్లో గుర్తించిన కొత్త వేరియంట్ పేరు ఏమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు.