చండీగఢ్: నేపాల్కు చెందిన మహిళ తన ఫ్రెండ్ను కలవలేకపోవడంతో నిరాశ చెందింది. మద్యం సేవించిన ఆమె ఆటోలో ప్రయాణించింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్, మరో ఇద్దరు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Nepali Woman Gang Raped) హర్యానాలో ఈ సంఘటన జరిగింది. నేపాల్ పౌరురాలైన 26 ఏళ్ల మహిళ కురుక్షేత్రలో నివసిస్తూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నది. ఫిబ్రవరి 24న ఫ్రెండ్ను కలిసిసేందుకు గురుగ్రామ్ చేరుకున్నది. ఫ్రెండ్ను కలవలేకపోవడంతో నిరాశ చెందిన ఆమె మద్యం సేవించింది.
కాగా, నేపాల్ మహిళ కురుక్షేత్రకు తిరిగి వెళ్లేందుకు ఆటోలో ప్రయాణించింది. అయితే ఆమె మద్యం మత్తులో ఉండటాన్ని డ్రైవర్, ఆటోలోని వ్యక్తులు గమనించారు. నహర్పూర్ రూపా ప్రాంతంలోని ఒక గదికి ఆ మహిళను తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై లైంగిక దాడి జరిగినట్లు నేపాల్ మహిళ గ్రహించింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆటో డ్రైవర్ను బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Police Trainees Reel | రీల్ తెచ్చిన చిక్కులు.. ఆరుగురు ట్రైనీ పోలీసులకు షోకాజ్ నోటీసులు
Anna Hazare | లిక్కర్ పాలసీపై కోర్టు తీర్పును అంగీకరించాలి: అన్నా హజారే
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?
Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు