న్యూఢిల్లీ, మే 13: నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షను వాయిదా వేస్తే వైద్యుల కొరత ఏర్పడుతుందని, ఇది రోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది.
గత ఏడాదికి సంబంధించిన నీట్ పీజీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాలేదని, ఈ సమయంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థులు నష్టపోతారంటూ కొంత మంది వైద్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నిర్వహించాల్సిన పరీక్షను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని కోరారు. పరీక్షను వాయిదా వేస్తే లక్షలాది మంది విద్యార్థులకు నష్టం కలుగుతుందని సుప్రీం కోర్టు పేర్కొన్నది.