న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: 2024 ఏడాదికి సంబంధించి జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ ఖరారయినట్టు తెలుస్తున్నది. జేఈఈ మెయిన్ సెషన్-1 వచ్చే ఏడాది జనవరిలో, ఏప్రిల్ మూడో వారంలో మరో సెషన్ నిర్వహించే అవకాశం ఉందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. కామన్ యూనివర్సిటీ టెస్ట్ను మే మొదటి వారంలో నిర్వహించవచ్చని తెలిపింది.
నీట్ యూజీ 2024ను ఎన్టీఏ వచ్చే ఏడాది మే 5న నిర్వహించే అవకాశాలున్నాయి.2024-25 ఎగ్జామినేషన్ క్యాలెండర్ను త్వరలోనే విడుదల చేస్తుందని భావిస్తున్నారు. జేఈఈ మెయిన్- 2024 నోటిఫికేషన్ వారంలో రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.