Exit Polls : అసోంకు సంబంధించిన ఎగ్టిట్ పోల్స్ విడుదలయ్యాయి. అనేక సంస్థల అంచనా ప్రకారం అసోంలో బీజేపీ ఆధ్వర్యంలోని అధికార ఎన్డీయే కూటమిదే మళ్లీ విజయం. అసోంలో ఇప్పటివరకు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేనే అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ సీఎంగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఎన్డీయే విజయం సాధించబోతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.
అసోంలో 126 అసెంబ్లీ సీట్లు ఉండగా, 64 సీట్లు సాధిస్తే అధికారం సాధ్యం. తాజా అంచనాలివి. మ్యాట్రిక్స్ అంచనా ప్రకారం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు 88–98 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 22–32 సీట్లు, ఇతరులకు 3–5 సీట్లు, చాణక్య స్ట్రాటజీస్ అంచనా ప్రకారం ఎన్డీయేకు 85–95 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 25–32 సీట్లు, ఇతరులకు 6–12 సీట్లు, పోల్ డైరీ అంచనా ప్రకారం ఎన్డీయేకు 88–101 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 15–26 సీట్లు, ఇతరులకు 3–7 సీట్లు, యాక్సిస్ మై ఇండియా సంస్థ అంచనా ప్రకారం ఎన్డీయేకు 88–100 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 24–36 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి.
అన్నింట్లోనూ బీజేపీ కూటమి ఘన విజయం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన ఎన్డీయే కూటమి అసోంలో మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనేది అంచనా.