న్యూఢిల్లీ : రేప్ను ఎంజాయ్ చేయాలంటూ కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ తప్పుబట్టారు. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని చట్టాలను చేస్తూనే, మరో పక్క అత్యాచారాలను ప్రోత్సహించడం దారుణమన్నారు. రేప్ను ప్రోత్సహిస్తూ వ్యాఖ్యానించే వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వకూడదు.. అలాంటి వారికి ప్రజలు కూడా ఓటు వేయొద్దని ఆమె సూచించారు. ఇలాంటి నాయకులు ప్రజల అభ్యున్నతి కోసం ఎలా పని చేస్తారో ఊహించుకుంటేనే ఆశ్చర్యమేస్తుందని రేఖా శర్మ అన్నారు.