Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను దాటకపోవడంతో విపక్ష ఇండియా కూటమిలోనూ అధికారంపై ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రంలో ఏ కూటమి అందలం ఎక్కాలన్నా ఎన్డీయే పక్షాలైన టీడీపీ, జేడీయూలు కీలకంగా మారాయి.
దీంతో ఈ పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు విపక్ష ఇండియా కూటమి కసరత్తు సాగిస్తోంది. శరద్ పవార్ ఈ పార్టీలతో టచ్లోకి వెళ్లారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీష్ కుమార్తో టచ్లో లేనని ఎన్సీపీ-ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకూ వారితో మాట్లాడలేదని అన్నారు.
ఇండియా కూటమి భేటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత తాను వారితో మాట్లాడతానని, ఇప్పటివరకూ మాత్రం వారితో ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పారు. కాగా టీడీపీ, జేడీయూలతో సంప్రదింపులపై బుధవారం జరిగే విపక్ష కూటమి భేటీలో ఓ నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.