ముంబై, ఏప్రిల్ 24 : మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి భవిష్యత్తుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్
చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎంవీఏ కూటమి భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదని
అన్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం ఆయన మాట్లాడారు. ఎంవీఏ కూటమి కలిసే
2024 ఎన్నికల్లో పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని, అయితే అది తాను ఒక్కడినే అనుకుంటే
జరగదని తెలిపారు.
కూటమిలోని మిగతా పార్టీలు తమ మనోగతాన్ని తెలపలేదన్నారు. సీట్ల పంపకం తదితర సమస్యల గురించి ఇంకా చర్చించలేదని పేర్కొన్నారు. చర్చలు జరగకుండానే భవిష్యత్తులో కలిసి పోటీ చేసే అంశం గురించి తానెలా ముందే చెప్తానని వెల్లడించారు.