ముంబై: మహారాష్ట్రలోని కొల్హాపూర్లో వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్తో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ హింసాత్మకంగా మారడంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. కొందరు వ్యక్తులు చేసిన పని ఈ పరిస్ధితికి దారితీయడం దురదృష్టకరమని అన్నారు. ఇది సమాజానికి మంచిది కాదని, అల్లర్ల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దర్యాప్తు అనంతరం వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని పేర్కొన్నారు. కాగా, కొల్హాపూర్లో రెండు వర్గాలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం కావడంతో రెండు గ్రూపుల మధ్య మతపరమైన వివాదం చెలరేగింది.
దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వాట్సాప్ పోస్టుకు నిరసనగా కొన్నిసంస్థలు కొల్హాపూర్ పట్టణ బంద్కు పిలుపునిచ్చాయి. కొల్హాపూర్లో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. పరిస్థితి అదుపు తప్పకుండా నియంత్రించేందుకు పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు, బలగాలను పట్టణంలో మోహరించారు.
Read More
Odisha Train Accident: కోరమండల్ రైలు ప్రమాదం.. సడన్గా చిమ్మచీకటి.. లైవ్ వీడియో వైరల్!