ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడమే కేంద్రం పెద్ద ప్రాజెక్టుగా కనిపిస్తోందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవాళ పత్రికలను చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష పార్టీలు, నాయకులపై చర్యలను ఎలా ముమ్మరం చేశాయనే దానిపై పూర్తి వివరాలు ఉన్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం కేంద్రం ప్రధాన ప్రాజెక్ట్ అని తెలుస్తోందంటూ విమర్శించారు. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు పక్కన పెట్టారని, దీనికి తాము రాజకీయంగా సమాధానం చెప్తామన్నారు.