గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసు స్టేషన్లో ఇద్దరు మావోయిస్టు దంపతులు బుధవారం లొంగిపోయారు. దీపక్ అలియాస్ మున్షి రామ్సు(34), ఆయన భార్య సాంబట్టి నీవరు ఆలం(25) లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. దీపక్పై 16 లక్షలు, సాంబట్టిపై రూ. 4 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
దీపక్ ప్లాటూన్ నంబర్ 21లో డివిజనల్ కమిటీ మెంబర్గా, కమాండర్గా పని చేస్తున్నారు. భార్య ఆలం మెంబర్గా కొనసాగుతున్నారు. దీపక్ మూడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఎనిమిది ఎన్కౌంటర్లలో తన హస్తం ఉంది. ఛత్తీస్గఢ్లో ఆరు చోట్ల పోలీసులపై జరిపిన మెరుపుదాడుల్లో కూడా దీపక్ కీలకపాత్ర పోషించారు. ఈ దాడుల్లో 31 మంది పోలీసులు మరణించారు. భద్రతా బలగాలతో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో సాంబట్టి ఉన్నారు. గడ్చిరోలి పోలీసుల ఎదుట ఇప్పటి వరకు మొత్తం 649 మంది మావోయిస్టులు లొంగిపోయారు.