34 ఏండ్లుగా భారత నావికాదళానికి సేవలందిస్తున్న ఐఎన్ఎస్ గోమతికి శనివారం వీడ్కోలు పలికారు. ఈ నౌక గోదావరి తరగతికి చెందిన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఇది కాక్టస్, పరాక్రమ్, రెయిన్బో వంటి ఆపరేషన్లలో ఎంతగానో సేవలందించింది.
ఈ నౌకను 1988 ఏప్రిల్ 16న బాంబేలోని మజగావ్ డాక్ వద్ద అప్పటి రక్షణ మంత్రి కేసీ పంత్ ప్రారంభించారు. ప్రజల సందర్శనార్థం లక్నోలోని గోమతి నదీ తీరాన ఈ నౌకను ఉంచనున్నారు. ఈ తీరాన ఇప్పటికే అనేక మిలిటరీ, యుద్ధ జ్ఞాపకాలు ప్రదర్శనకు ఉంచారు.