Bomb Threat | కర్ణాటకలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ పీఎస్ పరిధిలో గల రాజాజీనగర్లో ఉన్న ఎన్పీఎస్ (నేషనల్ పబ్లిక్ స్కూల్)కు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పశ్చిమ బెంగళూరు డీసీపీ లక్ష్మణ్ బి నింబరాగి తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ పాఠశాలకు చేరుకుని తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ పేర్కొన్నారు.
Karnataka | Bomb threat received by NPS School, Rajajinagar under Basaveshwar Nagar PS. We've ensured students are taken to a safe place, bomb disposal & dog squad have reached the spot. Case to be registered and investigation is being done: Laxman B Nimbaragi, DCP West Bengaluru pic.twitter.com/r9fBnhdWjI
— ANI (@ANI) January 6, 2023