NCP | శరద్ పవార్ నేతృత్వంలోని నేషనల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా ప్రమాదంలో పడింది. జాతీయ హోదాపై ఎన్నికల సంఘం త్వరలో సమీక్షించనున్నది. మహారాష్ట్రలో మహా వికాస్ అగాది కూటమిలో ఎన్సీపీ కొనసాగుతున్నది. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించారు. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే లోక్సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లు వచ్చి ఉండాలి. నాలుగు ఎంపీ సీట్లను సైతం గెలవాలి. దాంతో పాటు మరో అవకాశం సైతం ఉంది. అది ఏంటంటే.. దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాలు గెలిచి ఉండాలి. ఈ రెండుశాతం సీట్లు కూడా మూడు రాష్ట్రాల నుంచి గెలవాలి. ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నా జాతీయ పార్టీగా గుర్తిస్తారు. ఈ క్రమంలోనే ఎన్సీపీ 2019లో జాతీయ హోదా లభించింది. త్వరలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా రానున్నది.
దేశంలో ఇప్పటి వరకు దేశంలో భారీ సంఖ్యలోనే పార్టీలు ఉన్నా.. కొద్ది పార్టీలకు జాతీయ హోదా ఉన్నది. ఇందులో భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (BSP), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా , కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా Marxist), తృణమూల్ కాంగ్రెస్ (TMC) , నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP). ఎన్పీపీ (NMPP) పార్టీకి సైతం జాతీయ హోదా ఉన్నది. ఈ పార్టీకి 2019 జూన్ 7న జాతీయ హోదా లభించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి సైతం త్వరలో జాతీయ హోదా దక్కింది. గుజరాత్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆప్ ఐదు సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం ఓట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 6.8 శాతం ఓట్లు ఓట్లు దక్కాయి. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు సైతం గెలుపొందారు. ఆగస్టు నెలలోనే ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం.. గోవాలోనూ ఆప్ గుర్తింపు పొందిన పార్టీగా అవతరించింది.