న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు ఈడీ ముందు విచారణకు హాజరుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సోనియా ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు. గతవారం నుంచి ఆమె హోం ఐసోలేషన్లో ఉన్నారు. కరోనా నుంచి ఆమె కోలుకున్నట్లు వైద్యులు ఇంకా నిర్ధారించలేదు. అయితే మనీలాండరింగ్ కేసులో జూన్ 8న విచారణకు హాజరవ్వాలని ఈడీ గతంలో నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కరోనా నుంచి ఇంకా కోలుకోని సోనియా.. నేడు విచారణకు హాజరయ్యే విషయమై ఇంకా స్పష్టత లేదు.
కాగా, తాను విచారణకు రాలేనని సోనియా గాంధీ ఈడీకి లేఖ రాశారు. కరోనా నుంచి కోలుకోనందున విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై ఈడీ నుంచి ఎలాంటి సమాచారం వెలువడలేదు. ఇదే కేసులో రాహుల్ గాంధీ ఈ నెల 2న విచారణకు హాజరు కావాల్సిఉన్నది. అయితే తాను విదేశీ పర్యటలో ఉన్నానని, జూన్ 5 తర్వాత వస్తానని చెప్పారు. దీంతో ఈడీ విచారణ తేదీని ఈనెల 13కు మార్చిన విషయం తెలిసిందే.