న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నించనున్నారు. రాహుల్ గాంధీని ఇప్పటి వరకు దాదాపు 30 గంటల పాటు విచారించారు. శుక్రవారమే విచారణకు రావాలని ఈడీ రాహుల్కు సమన్లు జారీ చేయగా.. మూడు రోజులు సమయం ఇవ్వాలని కోరారు.
తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలో 17న కాకుండా 20న విచారణకు హాజరయ్యేందుకు మినహాయింపును ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. మరో వైపు ఈడీ విచారణను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలుపనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అలాగే మరోవైపు కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలిసే అవకాశం ఉన్నది.
#WATCH | Delhi: Congress leader Rahul Gandhi arrives at the Enforcement Directorate (ED) office, for questioning in the National Herald case. Today is the fourth day of his questioning by the agency. pic.twitter.com/4XHeiqf8Sr
— ANI (@ANI) June 20, 2022