హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, డీఏలు విడుదల చేయాలని, తదితర సమస్యలను పరిషరించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమారను టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కోరారు. శనివారం సచివాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. వినతికి సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రికి టీఎన్జీవో పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కే లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, నగరశాఖ ఉపాధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, హైదరాబాద్ ఉపాధ్యక్షుడు శంకర్ తదితరులున్నారు.
పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు అన్ని దవాఖానల్లో నగదు రహిత చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను ఆయన నివాసంలో కలిసి పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య కోరారు. ఈ వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారని జేఏసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. మంత్రిని కలిసిన వారిలో సెక్రెటరీ జనరల్ సుభాకర్రావు, కో చైర్మన్లు సూర్యనారాయణ, ఏ రాజేంద్రబాబు, అడిషనల్ సెక్రెటరీ జనరల్ ఎంవీ నరసింగరావు ఉన్నారు.
సహకారశాఖలోని ఉద్యోగులకు ఇతర శాఖలలోని సమాన కేడర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలను ప్రతిపాదించాలని పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను సహకార శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది. శనివారం బీఆర్కేఆర్ భవన్లో చైర్మన్కు వినతిపత్రం సమర్పించారు.