షిల్లాంగ్, ఫిబ్రవరి 27: ఈశాన్య రాష్ర్టాలైన మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీలకు సోమవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు పోలింగ్ నమోదైంది. నాగాలాండ్లో 84.08%, మేఘాలయలో 76.27% మంది ఓటర్లు ఓటేశారు. నాగాలాండ్లో 60 స్థానాలుండగా బీజేపీ అభ్యర్థి కజేటో కినిమ్ అకులుటో నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
మేఘాలయలో 60 స్థానాలకు ఒక అభ్యర్థి మృతితో ఇక్కడ కూడా 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ శాతాన్ని పెంచే నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకున్న మొదటి ఐదుగురు ఓటర్లకు మేఘాలయలో మెమెంటోలు అందజేశారు.