కోల్కత్తా, జూన్ 11: పశ్చిమబెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 4 వేల ఈవీఎంలు కాలిపోయాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ బిల్డింగ్లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఇందులో ఈవీఎంలతో పాటు ఇతర వస్తువులు కూడా కాలిపోయాయి. ఇదే బిల్డింగ్లో జిల్లా పరిషత్ ఆఫీసు కూడా ఉంది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బెంగాల్ మంత్రి కౌశిక్ చౌదరి మాట్లాడుతూ అగ్నిప్రమాదంపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
వీటిని గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ఉపయోగించారని తెలిపారు. మంటలు 9, 10వ ఫ్లోర్లోకి ఎలా వచ్చాయో అర్థం కావట్లేదని.. ఇందులో ఏదైనా కుట్ర ఉన్నదా అనే దానిపై ఆరా తీస్తున్నామని మంత్రి చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం బిల్డింగులో మంటలు చెలరేగాయని.. కానీ వాటిని కంట్రోల్ చేయలేకపోవడంతో ఈ భారీ ప్రమాదం జరిగిందని వివరించారు.